తెలంగాణ సర్కారుపై ట్విట్టర్‌లో Manikkam Tagore Fire

by Disha Web Desk 4 |
తెలంగాణ సర్కారుపై ట్విట్టర్‌లో Manikkam Tagore Fire
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సర్కారుపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్ లో సునీల్ కనుగోలు పోస్ట్ పెట్టినందుకు కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేశారన్నారు. 50 కంప్యూటర్లు సీజ్ చేసి డేటా దొంగిలించారన్నారు. ఎఫ్ ఐ ఆర్ లేకుండానే ఐదుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ పెట్టిన పోస్ట్‌నే నేను పోస్ట్ చేస్తున్నానన్నారు. అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని కేసీఆర్ కవిత ఉన్న ఫోటో ఒకవైపు, కోళ్ల దాణా కేసులో టీఆర్ఎస్ నేతలు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు రూ.వంద కోట్ల దాణా బుక్కారు అనే ఫోటోలను ట్వీట్‌కు జత చేశారు. పోస్ట్ పెట్టినందుకు తనను అరెస్ట్ చేయాలని తెలంగాణ సీఎంవోకు ట్వీట్ ట్యాగ్ చేశారు. హిట్లర్ కేసీఆర్ అనే హాష్ ట్యాగ్‌ను పోస్ట్‌కు జత చేశారు.

Read More...

ప్రజల అసంతృప్తిపై కేసీఆర్ సర్వే.. వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటీ..!



Next Story

Most Viewed